Madhupada Road Accident Today : విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం మదుపాడ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో 2 గంటలపాటు పలువురు ప్రయాణికులు చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Category
🗞
News